రాంచీ: టీమిండియాతో చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా.. ముందుగా టాస్ గెలిస్తే సగం పని అయిపోయినట్లేనని బలంగా నమ్ముతోంది. వరుస రెండు టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే టాస్ గెలవడమే ఆ జట్టు విజయాలు నమోదు చేయడానికి కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అనుకుంటున్నాడు. దాంతో రేపు(శనివారం) రాంచీ వేదికగా ఆరంభం కానున్న ఆఖరిదైన మూడో టెస్టులో తాను టాస్ దాదాపు రాబోనని సంకేతాలు ఇచ్చాడు డుప్లెసిస్. ప్రి మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో డుప్లెసిస్ మాట్లాడుతూ.. తమ జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నాడు. దాన్ని టాస్ నుంచే ఆరంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
' మూడో టెస్టు మ్యాచ్కు టాస్కు వేరే క్రికెటర్ని పంపుతా. టాస్ విషయంలో నా రికార్డు బాలేదు. దాంతో వేరే ఇంకొకర్ని టాస్కు పంపాలనుకుంటున్నా. టాస్ గెలిస్తే తొలి ఇన్నింగ్స్లో భారీ పరుగులు చేసే అవకాశం దొరుకుతుందనేది నా యోచన. ఆరంభానికి తొలి ఇన్నింగ్స్ కీలకం. గత రెండేళ్ల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను కట్టడి చేయాలంటే ఆది నుంచి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేయాలి. మొదటి రోజు పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుంది. దాంతో టాస్ గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఈ తరుణంలో నేను టాస్కు రావాలనుకోవడం లేదు' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.